మానవత్వం చాటుకున్న ‘భారతి’ | - | Sakshi
Sakshi News home page

మానవత్వం చాటుకున్న ‘భారతి’

Apr 16 2025 12:05 AM | Updated on Apr 16 2025 12:05 AM

మానవత్వం చాటుకున్న ‘భారతి’

మానవత్వం చాటుకున్న ‘భారతి’

ప్రొద్దుటూరు : మండు వేసవిలో కష్టపడుతున్న భవన నిర్మాణ కార్మికులపై భారతి సిమెంట్‌ యాజమాన్యం మానవత్వం చూపింది. ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో పలు చోట్ల పనిచేస్తున్న తాపీ మేసీ్త్రలకు వేడిమి నుంచి ఉపశమనం కల్పించేందుకు శీతల పానీయాలు, రక్షణ కోసం టీషర్ట్‌లు, టోపీలు మంగళవారం అందించింది. ఈ సందర్భంగా భారతి సిమెంట్‌ కంపెనీ టెక్నికల్‌ ఇంజినీర్‌ కె.నాగేంద్ర తాపీ మేసీ్త్రలతో మాట్లాడుతూ రోబోటిక్‌ టెక్నాలజీతో భారతి సిమెంట్‌ను తయారు చేస్తున్నారని, శ్లాబ్‌ల నిర్మాణానికి తమ సిమెంట్‌ అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సేల్స్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి, సీనియర్‌ టెక్నికల్‌ ఇంజినీరింగ్‌ ఛాయాపతి, చిన్న శ్రీకాంత్‌రెడ్డి, భవాని శంకర్‌, ఉదయ కిరణ్‌, సాయిప్రకాష్‌తోపాటు తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement