బ్రహ్మంగారిమఠం : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవింద మాంబల నిత్య కళ్యాణానికి భక్తులు విరాళాలు ఇస్తున్నారు. సోమవారం రాజుపాళెం మండలం అరకటవేముల గ్రామానికి చెందిన రాచంరెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి, ధర్మపత్ని వెంకటసుబ్బమ్మ కుటుంబ సభ్యులతో స్వామి మాస కళ్యాణంకు కార్తిక శుద్ద ద్వాదశ రోజున జరిపే ఈ కళ్యాణంకు రూ.1,00,150లు నగదు అందజేశారు. ఇదే క్రమంలో దువ్వూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన మాబుషరీఫ్ ధర్మపత్ని రేష్మి రూ.1,00,116లు అందించారు. వీరికి స్థానిక పిట్ పర్సన్ శంకర్బాలాజీ,మఠం మేనేజర్ ఈశ్వరాచారిలు ప్రత్యేక పూజలు చేయించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా పిట్ పర్సన్ మాట్లాడుతూ.. నూతనంగా తలపెట్టిన వీరబ్రహ్మేంద్ర, గోవిందమాంబల మాస కార్తిక శుద్ద ద్వాదశ రోజున జరిపే కళ్యాణానికి భక్తులకు వారికి తోచిన విధంగా విరాళాలు ఇస్తుండటం హర్షనీయమన్నారు.