ఉచితం మాటున ఇసుక దోపిడీ | - | Sakshi
Sakshi News home page

ఉచితం మాటున ఇసుక దోపిడీ

Mar 24 2025 5:57 AM | Updated on Mar 24 2025 10:00 PM

ఉచితం

ఉచితం మాటున ఇసుక దోపిడీ

సాక్షి టాస్క్‌పోర్స్‌ : ప్రకృతి సంపద అధికార పార్టీ నేతలకు కల్పతరువుగా మారింది. రూ. లక్షల్లో కాసులు కురిపిస్తుండటంతో నిబంధనలు ఇసుకలో తొక్కేస్తున్నారు. ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసుకొని చిత్రావతి నది నుంచి ట్రాక్టర్లతో ఇసుక పాయింట్‌ వద్దకు కూలీలతో తోలే విధంగా అనుమతులు ఉన్నాయి. అయితే వాటిని పక్కన పెట్టి నదిలోనే ఇటాచీలతో నేరుగా తోలుకుంటున్నారు. స్టాక్‌ పాయింట్లను అనువుగా మార్చుకుని దందాకు తెర తీశారు. రోజూ పదుల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా జోరుగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన పోలీసు, మైనింగ్‌, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. కొండాపురం మండలంలోని ఇసుక రీచ్‌లలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఉచితం మాటున కొందరు టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇష్టారాజ్యంగా ఇసును ఇటాచీలతో తవ్వి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత ఇసుకను తీసుకొచ్చింది. ఇదే కొందరు అధికార పార్టీ నాయకులకు ఆదాయ వనరుగా మారింది. చిత్రావతి నది నుంచి ఒక టిప్పర్‌కు రూ.5 వేల నుంచి రూ. 6 వేలు తీసుకొని అక్రమంగా జోరుగా ఇసుకను తరలిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఇసుక స్టాక్‌ పాయింట్‌ వద్ద బిల్లులు ఇచ్చే సిబ్బంది లేరు. ఇదే అదనుగా చిత్రావతి నది నుంచి అధికారుల అండతో పదుల సంఖ్యలో ఇసుక టిప్పర్లు అక్రమంగా తరలిస్తున్నారు. చిత్రావతి నది నుంచి కూలీలతో తోలకుండా యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు. ఈ అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

యథేచ్ఛగా టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలింపు

పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్‌,

పోలీస్‌ అధికారులు

ఉచితం మాటున ఇసుక దోపిడీ1
1/1

ఉచితం మాటున ఇసుక దోపిడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement