సీజనల్‌ వ్యాధులను కట్టడి చేద్దాం | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులను కట్టడి చేద్దాం

Mar 13 2025 12:42 AM | Updated on Mar 13 2025 12:39 AM

కడప రూరల్‌: సీజనల్‌ వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం అని జోనల్‌ మలేరియా అధికారి డాక్టర్‌ కే లక్ష్మీనాయక్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ నాగరాజు అన్నారు. బుధవారం స్థానిక వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని మీటింగ్‌ హల్‌లో రాయలసీమ ప్రాంత 8 జిల్లాలకు సంబంధించిన సబ్‌ యూనిట్‌ మలేరియా అధికారులకు సీజనల్‌ వ్యాధులపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం అని యూనిట్‌ మలేరియా అధికారులు గుర్తించాలన్నారు. గ్రామాల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను మొక్కుబడిగా నిర్వహించొద్దన్నారు. ఆరోగ్య సిబ్బంది క్షేత్ర స్దాయిలో పర్యటించినప్పుడు దోమలను ఉత్పత్తి చేసే బ్లీడింగ్‌ ప్రాంతాలను తప్పనిసరిగా గుర్తించాలని .. ఆయా గ్రామాల్లో మలేరియా వర్కర్ల చేత తప్పనిసరిగా క్రిమి సంహారక మందులను స్ప్రేయింగ్‌ చేయించాలని ఆదేశించారు. రాష్ట్ర మలేరియా విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ రామనాఽథం మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి మనోరమ, కడప మైక్రోబయాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నాగసుధారాణి, మలేరియా నివారణ అధికారులు ఏ నూకరాజు, బీ వేణుగోపాల్‌, డాక్టర్‌ సౌమ్య పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధులపై శిక్షణ

కార్యక్రమంలో వైద్యాధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement