ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్‌సీపీదే అధికారం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్‌సీపీదే అధికారం

Mar 13 2025 12:36 AM | Updated on Mar 13 2025 12:35 AM

పులివెందుల రూరల్‌ : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం తథ్యమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ.సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా విలేకరులతో సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ప్రజల వ్యతిరేకత కూడగట్టుకుందన్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తే 151 స్థానాల్లో విజయం అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడంలోనూ, ప్రజల సంక్షేమం కోసం పెద్దపీట వేయడంలోనూ ఆయన ముందున్నారన్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమై కోట్లు ఖర్చు పెట్టి అసత్య ప్రచారాలతో సాధ్యం కాని హామీలు ఇచ్చారన్నారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందాలన్నా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలన్నా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నడుంబిగించాలన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఎస్వీ.సతీష్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement