ముగిసిన మూడో విడత | - | Sakshi
Sakshi News home page

ముగిసిన మూడో విడత

Dec 6 2025 9:35 AM | Updated on Dec 6 2025 9:35 AM

ముగిసిన మూడో విడత

ముగిసిన మూడో విడత

చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు

రాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ

సాక్షి,యాదాద్రి : మూడవ విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల దాఖలుకు గడువు శుక్రవారం ముగిసింది. చివరి రోజు కావడంత్రో అభ్యర్థులు పోటెత్తారు. సాయంత్రం 5 గంటలకు గడువు ముగియగా.. అప్పటికే వరుసలో వేచి ఉన్న అభ్యర్థులను నామినేషన్‌ వేసేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులతో పాటు వారికి మద్దతు ఇచ్చేందుకు వచ్చిన వారిని లైన్‌లో నిలబెట్టి టోకెన్లు ఇచ్చారు. పలు చోట్ల రాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. ఈ విడతలో భువనగిరి, చౌటుప్పల్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూరు, అడ్డగూడూరు, మోటకొండూరు, గుండాల మండలాల్లో 124 పంచాయతీలు, 1,086 వార్డులకు ఈనెల 17న పోలింగ్‌ జరగనుంది. అభ్యర్థులు ర్యాలీలతో వచ్చి నామినేషన్‌ వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement