మూడో విడతకు నేడు ఆఖరు | - | Sakshi
Sakshi News home page

మూడో విడతకు నేడు ఆఖరు

Dec 5 2025 3:28 PM | Updated on Dec 5 2025 3:28 PM

మూడో విడతకు నేడు ఆఖరు

మూడో విడతకు నేడు ఆఖరు

రెండో రోజు సర్పంచ్‌కు 147, వార్డులకు 641

సాక్షి,యాదాద్రి : మూడవ విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో రెండో రోజు గురువారం నామినేషన్లు వెల్లువెత్తాయి. సర్పంచ్‌కు 147, వార్డు స్థానాలకు 641 మంది నామినేషన్‌ వేశారు. రెండు రోజుల్లో కలిపి సర్పంచ్‌కు 281, వార్డులకు 888 నామినేషన్లు పడ్డాయి. ఈ విడతలో భువనగిరి, చౌటుప్పల్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూరు, అడ్డగూడూరు, మోటకొండూరు, గుండాల మండలాల్లో 124 పంచాయతీలు, 1,086 వార్డులకు డిసెంబర్‌ 17న పోలింగ్‌ జరగనుంది. మూడో విడత నామినేషన్ల ఘట్టం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

రెండో రోజు దాఖలైనవి..

మండలం జీపీలు నామినేషన్లు

అడ్డగూడూరు 17 10

చౌటుప్పుల్‌ 26 36

గుండాల 20 24

మోటకొండూరు 20 28

మోత్కూరు 10 14

నారాయణపురం 31 35

మొత్తం 124 147

వార్డు సభ్యుల స్థానాలకు

మండలం వార్డులు నామినేషన్లు

అడ్డగూడూరు 150 55

చౌటుప్పుల్‌ 236 187

గుండాల 182 101

మోటకొండూరు 170 103

మోత్కూరు 88 60

నారాయణపురం 260 135

మొత్తం 1,086 641

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement