దళారులను నమ్మి మోసపోవద్దు | - | Sakshi
Sakshi News home page

దళారులను నమ్మి మోసపోవద్దు

Oct 24 2025 2:04 AM | Updated on Oct 24 2025 2:04 AM

దళారులను నమ్మి మోసపోవద్దు

దళారులను నమ్మి మోసపోవద్దు

యాదగిరిగుట్ట రూరల్‌: రైతులు తాము పండించిన పంటను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్‌ హనుమంతరావు సూచించారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి ధాన్యం కొనుగోళ్ల వివరాలు తెలుసుకున్నారు. ధాన్యం తేమశాతం రాగానే వెంటనే కాంటా వేసి మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. కేంద్రంలో విద్యుత్‌ సౌకర్యం లేదని రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో సమస్యను పరిష్కరించాలని ఏఈని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement