హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

Oct 24 2025 2:04 AM | Updated on Oct 24 2025 2:04 AM

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

సత్ఫలితాలినిస్తున్న

రూరల్‌ హెల్త్‌ ట్రైనింగ్‌ సెంటర్‌

బొమ్మలరామారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెరిగిన ఓపీ

అందుబాటులో స్పెషలిస్టు డాక్టర్లు

భువనగిరి: రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్‌ విమర్శించారు. గురువారం భువనగిరిలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని, అర్హత ఉన్నా రైతుభరోసా అందలేని ఆరోపించారు. ప్రధానమంత్రి ఫసల్‌ భీమా పథకాన్ని వెంటకనే అమలు చేయాలని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రత్నపురం బలరాం, సురేష్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, పట్నం శ్రీనివాస్‌, కోటేష్‌, బాలస్వామి, మాణిక్యంరెడ్డి, సురేష్‌, ఉడుత భాస్కర్‌, రత్నపురం శ్రీశైలం, సతీష్‌ పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement