రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

Sep 26 2025 7:24 AM | Updated on Sep 26 2025 7:24 AM

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

మిర్యాలగూడ అర్బన్‌: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ–కొండ్రపోల్‌ మధ్య రైలు పట్టాలపై బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి చైన్నె ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఎదురుగా వెళ్లడంతో రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు కోలముఖంతో 6.5 అడుగుల ఎత్తు ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. తెలుపు రంగు షర్టు, జీన్స్‌ ప్యాంట్‌ ధరించినట్లు పేర్కొన్నారు. నల్లగొండ రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లగొండ రైల్వే ఎస్‌ఐ బొడిగె రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement