‘నవాబుపేట’తో గుండాల సస్యశ్యామలం | - | Sakshi
Sakshi News home page

‘నవాబుపేట’తో గుండాల సస్యశ్యామలం

Sep 6 2025 4:25 AM | Updated on Sep 6 2025 4:25 AM

‘నవాబుపేట’తో గుండాల సస్యశ్యామలం

‘నవాబుపేట’తో గుండాల సస్యశ్యామలం

గుండాల: నవాబుపేట రిజర్వాయర్‌ నీటితో గుండాల మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. శుక్రవారం నవాబుపేట రిజర్వాయర్‌ ద్వారా గుండాల మండలానికి సాగునీటిని విడుదల చేశారు. గంగమ్మకు పసుపు, కుంకుమలు పూలు సమర్పించి కొబ్బరి కాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని చెరువులను నింపి ప్రతి ఎకరాకు నీరందిస్తామన్నారు. కాల్వలకు మరమ్మతులు చేపడతామన్నారు. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. అప్పుల పాలు చేసి రైతులపై భారం మోపిందన్నారు. ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, స్టేషన్‌ ఘణపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మోత్కూరు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ నూనెముంతల విమలవెంకటేశ్వర్లు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరిగౌడ్‌, ద్యాప కృష్ణారెడ్డి, ఇమ్మడి దశరథ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement