
రైతు ప్రయోజనాలే లక్ష్యం
వారికి ఆర్థికంగా లబ్ధిచేకూర్చేలా ప్రణాళికలు
పెద్ద ఎత్తున రుణ సదుపాయం, జీవన ప్రమాణాలు పెంచేలా నిర్ణయాలు
ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం రూ.1100 కోట్లు
గతేడాది కంటే రూ.483 కోట్ల అదనపు రుణాలు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘ఉమ్మడి జిల్లాలో రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా బ్యాంకు కార్యకలాపాలు విస్తృతం చేశాం. సహకార వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు రైతులకు ఆర్థిక సహాయం అందించడం, గ్రామీ ణాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడతున్నాం’ అని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (2025–26)రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు వారికి బ్యాంకు రుణ పరిమితి పెంచినట్లు తెలిపారు. డీసీసీబీ 107 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఉమ్మడి జిల్లాలో 108 సహకార సంఘాల ద్వారా రైతులకు సేవలందిస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకు ఆధ్వర్యంలో గత ఆర్థిక సంవత్సరం చేపట్టిన కార్యక్రమాలు, ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు.