
వ్యక్తిగత, హౌసింగ్, వ్యాపార రుణాలు
మరో ఆరు కొత్త బ్రాంచ్లు
ఉమ్మడి జిల్లాలోని తిప్పర్తి, ఆత్మకూర్, గరిడేపల్లి, నారాయణపూర్, దామరచర్లలో కొత్త బ్రాంచీల ఏర్పాటుకు ఇప్పటికే ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. వాటిని త్వరలో ప్రారంభిస్తాం. ఈ ఆర్ధిక సంవత్సరంలో మరో 6 కొత్త బ్రాంచీల ఏర్పాటుకు ఆర్బీఐకి ప్రతిపాదనలను పంపించాం. మిర్యాలగూడ, శాలిగౌరారం, పెద్దవూర, మోతె, చిలుకూరు, నాంపల్లిలో వాటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు గతంలో హౌసింగ్ లోన్లు ఇవ్వలేదు. మా పాలకవర్గం బాధ్యతలు చేపట్టాకే గృహ నిర్మాణ రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాం. గరిష్టంగా రూ.35 లక్షల వరకు హౌసింగ్ లోన్ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.5 లక్షల వరకు వ్యక్తిగత, బిజినెస్ రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాం. అలాగే ఫిష్, డెయిరీ, పౌల్ట్రీ తదితర రంగాలకు 35 శాతం సబ్సిడీతో రుణాలను ఇస్తాం. గొర్రెలు, నాటుకోళ్ల్ల పెంపకానికి రుణ సదుపాయం కల్పిస్తున్నాం. కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా తమ బ్రాంచీల పరిధిలో అక్షరాస్యత కేంద్రాలను ఏర్పాటు చేశాం. వాటిల్లో ప్రజలకు ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది మార్చి 31వ తేదీవరకు 310 గ్రామాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించాం.