ఏపీ ప్రభుత్వ వైఖరిపై నిరసన | - | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వ వైఖరిపై నిరసన

May 9 2025 1:59 AM | Updated on May 9 2025 1:59 AM

ఏపీ ప్రభుత్వ వైఖరిపై నిరసన

ఏపీ ప్రభుత్వ వైఖరిపై నిరసన

భువనగిరిటౌన్‌ : సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ధనంజయ రెడ్డి నివాసంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అకారణంగా తనిఖీలు చేసి భయభ్రాంతులకు గురి చేయడాన్ని నిరసిస్తూ గురువారం భువనగిరిలోని బాబు జగ్జీవ న్‌రాం చౌరస్తాలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడం తగదన్నారు. వీరికి కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, సీపీఎం, సీపీఐతో పాటు కుల, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యుజేఐ జిల్లా అధ్యక్షుడు యంబ నర్సింహులు, బీఆర్‌ఎస్‌ నాయకుడు కొలుపుల అమరేందర్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కొండమడుగు నరసింహ, ఏశాల అశోక్‌, బర్రె జహంగీర్‌, కందుల శ్రీనివాస్‌, ఎనబోయిన ఆంజనేయులు, టీయూడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కొలుపుల వివేకానంద, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్‌గుప్తా, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏశాల అశోక్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ కమిటీ అధ్యక్షుడు ఏవీ కిరణ్‌కుమార్‌, కార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్‌, టీయుడబ్ల్యూజేఐ జేయు పట్టణ కార్యదర్శి కందుల శ్రీనివాస్‌, మాటూరు బాలరాజుగౌడ్‌, సురుపంగ శివలింగం, బూరుగు మణికంఠ, జర్నలిస్ట్‌ సంఘాల నాయకులు కూరెల్ల మల్లేష్‌, ఖాజా బాయ్‌, లక్ష్మీనారాయణ, పాక జహంగీర్‌, కనక బాలకృష్ణ, భువనగిరి శ్రీనివాస్‌, బండారు జగదీష్‌, గుర్రాల శివనాగేందర్‌, ఎస్‌డీ అఫ్జల్‌, ఎండీ జకీర్‌, నిమ్మల సురేష్‌, గడ్డం వెంకటేష్‌, సతీష్‌, బుగ్గ శ్రీను, శ్యామల శోభన్‌బాబు, నవీన్‌, హరిబాబు, ఇటుకల దేవేందర్‌, కైరంకొండ నవీన్‌, గుండేటి హరిబాబు, ఈరపాక నరసింహ, మాయ కృష్ణ, ఈరపాక నరసింహ, మాటూరి వెంకటేశ్వర్లు, ఎండీ జమాలుద్దీన్‌, శివనందుల రమేష్‌, లోడే చంద్రశేఖర్‌గౌడ్‌, వడ్లకొండ భరత్‌, కోరుటూరి ఉపేందర్‌, ఎర్ర శ్రీకాంత్‌, కూర వెంకటేష్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ సాక్షి ఎడిటర్‌ ఇంట్లో పోలీసుల తనిఖీలను ఖండిస్తూ జర్నలిస్టుల ఆందోళన

ఫ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement