
సుందరీమణుల పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
సాక్షి,యాదాద్రి : ప్రపంచంలోని వివిధ దేశాల సుందరీమణులు ఈనెల 15వ తేదీన యాదగిరిగుట్ట క్షేత్రం, భూదాన్పోచంపల్లిలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో డీసీపీతో పాటు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు.గుట్ట, పోచంపల్లికి వచ్చే ప్రధాన మార్గాలను అర్చీలు, స్వాగత తోరణాలతో అందంగా తీర్చిదిద్దాలని సూచించారు.సుందరీమణులు పర్యటించే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్ అధికారులు ముందస్తుగా మాక్డ్రిల్ నిర్వహించాలని, బ్యాటరీ వాహనాలు, రోప్వే సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని, గుర్తింపు పొందిన ప్రాంతాల్లో హోర్డింగులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అకాల వర్షాల దృష్ట్యా జేసీబీలను సిద్ధంగా ఉంచాలన్నారు. వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, టూరిజం కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఉపేందర్రెడ్డి, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట ఏసీపీలు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్