హెచ్‌ఎండీఏ నుంచి 56 | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎండీఏ నుంచి 56

May 6 2025 1:24 AM | Updated on May 6 2025 1:24 AM

హెచ్‌

హెచ్‌ఎండీఏ నుంచి 56

కోట్లు
మున్సిపాలిటీలు, గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు

సీసీ, బీటీ రోడ్లు, డ్రెయినేజీలకు ప్రాధాన్యం

ప్రతిపాదనలకు హెచ్‌ఎండీఏ ఆమోదం

15వ తేదీ లోపు టెండర్లు పూర్తి

సాక్షి,యాదాద్రి : హెచ్‌ఎండీఏ (హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అఽథారిటీ) పరిధిలోని మున్సిపాలిటీలకు, గ్రామాలకు ఆ సంస్థ నుంచి రూ.56.18 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో రోడ్లు, డ్రెయినేజీల పనులు చేపడతారు. ఈ నెల 15లోపు టెండర్లు పిలిచి ఆరు నెలల్లో పూర్తయ్యేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు

నిధులను వీటికి ఖర్చు చేస్తారు

● భువనగిరి మున్సిపాలిటీలో రూ.5.80 కోట్లతో ప్రధాన రోడ్డు ఫుట్‌పాత్‌, సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్‌ డ్రైయినేజీ, సీసీ డ్రైయినేజీ నిర్మిస్తారు. వార్డుల్లో అంతర్గత రోడ్లు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, సీసీ డ్రైయిన్లు, ఫుట్‌పాత్‌ పేవ్‌మెంట్‌ పనులకు రూ.7.80 కోట్లు కేటాయించారు.

● భూదాన్‌పొచంపల్లి మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.7.90 కోట్లు

● భువనగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి రూ.9.50 కోట్లు

● బీబీనగర్‌ మండలంలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీల నిర్మాణానికి రూ.16.08 కోట్లు

● భూదాన్‌పోచంపల్లి మండలంలో సీసీ రోడ్లు, అంతర్గత డ్రెయినేజీలకు రూ.9.10 కోట్లు కేటాయించారు.

కొత్త మండలాలకూ త్వరలో నిధులు

హెచ్‌ఎండీఏలో కొత్తగా చేరిన మండలాలకు నిధుల కేటాయింపునకు మరికొంత సమయం పట్టనుంది. ప్రస్తుతం ఐదు మండలాలు, మూడు మున్సిపాలిటీలకు మాత్రమే నిధులు కేటాయించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి చొరవతో భువనగిరి, భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీలకు నిధులు మంజూరయ్యాయి. చౌటుప్పల్‌, బొమ్మలరామారం మండలాలకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. నిధుల కోసం అక్కడి ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

తక్షణ అవసరాలకు ఖర్చు చేస్తాం

హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న భువనగిరి నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీలకు నిధులు మంజూయ్యాయి. ఈ నిధులను తక్షణ అవసరాల నిమిత్తం ఖర్చుచేస్తాం. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి హెచ్‌ఎండీఏకు పంపగా ఆమోదించింది. టెండర్లు నడుస్తున్నాయి. కొత్తగా హెచ్‌ఎండీఏలో చేరిన వలిగొండ మండలానికి వచ్చే బడ్జెట్‌లో నిధులు మంజూరవుతాయి.

–కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే

పెరిగిన హెచ్‌ఎండీఏ పరిధి

2025 మార్చిలో హెచ్‌ఎండీఏ పరిధిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలిసారి 2009లో హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు కోర్‌ అర్బన్‌ సిటీగా, ఔటర్‌ రింగ్‌ రోడ్డునుంచి రీజినల్‌ రింగ్‌రోడ్డు వరకు సెమీఅర్బన్‌ ఏరియాగా ప్రభుత్వం నిర్ధారించింది. హెచ్‌ఎండీ పరిధిలో ఇప్పటికే భువనగిరి, బీబీనగర్‌, బొమ్మలరామారం, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్‌ మండలాలు ఉన్నాయి. తాజాగా పరిధి పెంచడంతో కొత్తగా తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, వలిగొండ, సంస్థాన్‌నారాయణపురంలోని పలు గ్రామాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. ఈ గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్‌ప్లాన్‌ రూపొందించి ఏడాదిలోగా అమలు చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉందని హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు చెప్పారు.

హెచ్‌ఎండీఏ నుంచి 561
1/1

హెచ్‌ఎండీఏ నుంచి 56

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement