ధర్మోజిగూడెం అండర్‌పాస్‌కు మోక్షం | - | Sakshi
Sakshi News home page

ధర్మోజిగూడెం అండర్‌పాస్‌కు మోక్షం

May 6 2025 1:24 AM | Updated on May 6 2025 1:24 AM

ధర్మోజిగూడెం అండర్‌పాస్‌కు మోక్షం

ధర్మోజిగూడెం అండర్‌పాస్‌కు మోక్షం

చౌటుప్పల్‌ రూరల్‌: హైదరాబాద్‌– విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరిగే చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెం స్టేజీ వద్ద అండర్‌పాస్‌ నిర్మాణానికి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సోమవారం హైదరాబాద్‌లో వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ధర్మోజీగూడెం కూడలి వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో ఒక్కోసారి ఇద్దరు, ముగ్గురు మృత్యువాత పడ్డారు. అత్యంత ప్రమాదకరమైన ఈ ప్రాంతంలో ప్రస్తుతం జరిగే 17 బ్లాక్‌స్పాట్‌లతో పాటు ఇక్కడ కూడా పనులు చేపట్టాల్సి ఉండే. వెహికిల్‌ అండర్‌పాస్‌ వంతెన అవసరమని గుర్తించిన జాతీయ రహదారి సంస్థ అధికారులు.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంతో ఎట్టకేలకు మోక్షం లభించింది. వంతెన పూర్తయితే ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. నేషనల్‌ హైవే అథారిటీ నుంచి అనుమతులు రాగానే అండర్‌పాస్‌ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా జాతీయ రహదారి ఆరు లేన్ల విస్తరణ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని గడ్కరీ ప్రకటించారు.

ఫ హైదరాబాద్‌లో వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement