
ముమ్మరంగా సుందరీకరణ పనులు
భూదాన్పోచంపల్లి: పోచంపల్లికి ఈ నెల 15న మిస్ట్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు రానున్న నేపథ్యంలో స్థానిక టూరిజం పార్కులో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పార్కులోని గదులు, హాల్, మ్యూజియంలో రంగులువేసి సుందరీకరిస్తున్నారు. అలాగే పార్కు ప్రాంగణాన్ని పచ్చని లాన్తో తీర్చిదిద్దుతున్నారు. అందాల భామల బృందం సాయంత్రం 6 గంటలకు వచ్చి నుంచి రాత్రి 8.30 గంటలవరకు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో టూరిజం ప్రాంగణంలో గల విద్యుద్దీపాలన్నింటినీ రిపేర్ చేస్తున్నారు. మరో 10 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో పనులను వేగవంతం చేశారు.