
అన్న ప్రసాద కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం
యాదగిరిగుట్ట : అన్నప్రసాద కేంద్ర భవనాన్ని త్వరలోనే ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ వెంకట్రావ్ తెలిపారు. యాదగిరికొండ దిగువన నూతనంగా నిర్మించిన అన్నప్రసాద కేంద్రం పనులు పూర్తయినా ప్రారంభించకపోవడంపై ప్రారంభంలో జాప్యంశ్రీ శీర్షికన ఈనెల 2న సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఈఓ స్పందించారు. శనివారం భవనాన్ని సందర్శించి అందులో వసతులను పరిశీలించారు. వెగెశ్న ఫౌండేషన్ నిర్వాహకులతో సంప్రదింపులు చేసి త్వరలో అన్నప్రసాద కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.అనంతరం టెంపుల్ సిటీపై వేద పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. అలాగే పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడ ప్రసాద విక్రయశాల, టిక్కెట్ కౌంటర్, పరిసరాలను తనిఖీ చేశారు. అధికారులు, అర్చకులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఈఓ భాస్కర్శర్మ, అధికారులు దయాకర్రెడ్డి, రామారావు ఉన్నారు.
ఫ గుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్