
కూలీలకు గిట్టుబాటు వేతనం అందించాలి
చిట్యాల: ఉపాధి హామీ కూలీలకు రోజువారీగా వేతనం గిట్టుబాటు అయ్యేలా అధికారులు పనులు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన అన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోని తిరులనాథస్వామి ఆలయ గుట్టపై ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కందకం తవ్వకం పనులు, వన నర్సరీలను గురువారం ఆమె జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు, రోజుకు వస్తున్న వేతన వివరాలు, సమస్యలను కూలీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నర్సరీల్లో నీడనిచ్చే, పండ్ల మొక్కలను పెంచాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో తాము సొంత డబ్బులతో పనులు చేయాల్సి వస్తోందని ఆమెకు పలువురు కార్యదర్శులు వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాజ్కుమార్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీపీఓ వెంకయ్య, తహసీల్దార్ క్రిష్ణనాయక్, ఎంపీడీఓ జయలక్ష్మీ, ఏపీఓ శ్రీలత, ఉపాధి సిబ్బంది, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి పనులను నిర్లక్ష్యం చేయొద్దు
నార్కట్పల్లి: ఉపాధి హామీ పనులను నిర్లక్ష్యం చేయకుండా పూర్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన అన్నారు. నార్కట్పల్లిలో ఉపాధి పనులు, కంపోస్ట్ షెడ్, బ్రాహ్మణ వెల్లంలలో బృహత్ పల్లె ప్రకృతి వనం, మాదవ ఎడవల్లిలో పామ్పాండ్ పనులను గురువారం ఆమె పరిశీలించారు. అడిషనల్ పీడీ నవీన్, ఎంపీడీఓ ఉమేష్, ఎంపీఓ సుధాకర్, ఏపీఓ యాదయ్య, కార్యదర్శులు ఉన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన