ఫ ఎంజీయూ వైస్ చాన్స్లర్
ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో భౌతిక శాస్త్ర ప్రయోగశాలను శుక్రవారం వైస్ చాన్స్లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భౌతిక శాస్త్రం విభాగంలో మెరుగైన పరిశోధనలకు అనుగుణంగా ల్యాబ్ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రపంచానికి ప్రయోజనం చేకూరే నాణ్యమైన పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు ఆ దిశగా తమ ప్రయత్నాలు చేసి సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అల్వాల రవి, ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ్సాగర్, సైన్స్ డీన్ ప్రొఫెసర్ వసంత, సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, డాక్టర్ కొప్పుల సత్తిరెడ్డి, భిక్షమయ్య, రమేష్, డాక్టర్ శాంతకుమారి, ఆదిరెడ్డి, వీరస్వామి, రూప తదితరులు పాల్గొన్నారు.