మహిళా చట్టాలపై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

మహిళా చట్టాలపై అవగాహన తప్పనిసరి

Mar 22 2025 1:24 AM | Updated on Mar 22 2025 1:21 AM

భువనగిరి : మహిళా చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవీలత సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని శుక్రవారం సార్ప్‌ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్‌ ప్రమీల ఆధ్వర్యంలో భువనగిరిలోని పశు సంవర్థక శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు జరిగితే టోల్‌ప్రీ నంబర్‌ 181 ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం సఖి కేంద్రాల సీఏలు లావణ్య, రేణుకను సన్మానించారు ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్‌ బండారు జయశ్రీ, భువనగిరి బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షురాలు విజ య, సార్ప్‌ సంస్థ సిబ్బంది సరిత, కృష్ణవేణి, శ్రీని వాస్‌రావు, రాజేష్‌, శోభ, స్వరూప పాల్గొన్నారు.

ఫ జిల్లా న్యాయమూర్తి మాధవీలత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement