భువనగిరి : పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతమైన వాతావరణంలో మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో 8,627 మంది విద్యార్థులకు గాను 8,616 మంది హాజరయ్యారు.11 మంది గైర్హాజరయ్యారు. భువనగిరిలోని గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రాన్ని కలెక్టర్ హనుమంతరావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గౌతమ్ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను డీఈఓ సత్యనారాయణ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు కాగా అరగంట ముందుగానే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు.
తొలి రోజు 8,616 మంది హాజరు