చిట్యాల: సమాజంలో చైత్యనం కల్గించటమే లక్ష్యంగా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన తొలి తరం కవి రావిరాల బుచ్చయ్య కవిత్వం, రచనలు సాగాయని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. దివంగత రావిరాల బుచ్చయ్య రచించిన చైతన్య బావుటా, విముక్తి పథంలో గ్రంథాలను హైదరాబాద్లోని మౌలాలి రైల్వే ఇనిస్టిట్యూట్లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రావిరాల బుచ్చయ్య కడదాక సైద్ధాంతిక నిబద్ధత కల్గిన కవిగా ఉన్నారన్నారు. తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి, పర్యావరణవేత్త ఎదుల్ల అంజిరెడ్డి, సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్, ప్రధాన కార్యదర్శి సాగర్ల సత్తయ్య, వట్టిమర్తి గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నర్రా లవేందర్రెడ్డి, నర్రా భాస్కర్రెడ్డి, బూరుగు గోపికృష్ణ, రాజారామ్మోహన్రాయ్, డాక్టర్ రాపోలు రామకృష్ణ, రావిరాల బుచ్చయ్య కుటుంబ సభ్యులు రావిరాల సుమతి, సమత, మమత, కిషన్, రమాకాంత్, హారిక పాల్గొన్నారు.