నాగార్జునసాగర్: సాగర్ డ్యాం ఎడమ వైపున బుధవారం సాయంత్రం ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని గడ్డి పూర్తిగా తగలబడింది. నష్టాన్ని అంచనా వేసేందుకు గురువారం నల్లగొండ జిల్లా చీఫ్ ఇంజనీర్ అజయ్కుమార్, సాగర్ డ్యాం సర్కిల్ ఈఈ శ్రీధర్రావు, ఈఈ మల్లికార్జున్రావు, ఇంజనీర్లు అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాను నిలిపి వేశామని, లైన్లు కలిపితే ఏ మేరకు నష్టం జరిగిందో తెలుస్తుందన్నారు. సీసీ కెమెరాల కేబుల్స్ కాలిపోయాయని, తిరిగి కేబుల్స్ను ఏర్పాటు చేస్తామన్నారు.
రైలు నుంచి జారిపడి
గుర్తుతెలియని వ్యక్తి మృతి
నల్లగొండ: రైలులో నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గురువారం చిట్యాల రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. నల్లగొండ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి. రామకృష్ణ తెలిపిన ప్రకారం.. సుమారు 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి రామన్నపేట వైపు రైలులో వస్తూ చిట్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. నల్ల గొండ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ నవీన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే 87126 58595 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
దొంగ అరెస్ట్
రామగిరి (నల్లగొండ): చోరీలకు పాల్పడుతున్న దొంగను నల్లగొండ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి గురువారం విలేకరులకు వెల్లడించారు. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో చర్లపల్లి సెంటర్లో రూరల్ పోలీసులు గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా.. స్కూటీపై అనుమానస్పదంగా వెళ్తున్న బత్తుల విజయ్చందర్ను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడుతున్న అంగీకరించాడు. అతడి వద్ద నుంచి 5తులాల బంగారు ఆభరణాలు, రూ.20వేల నగదు, స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
నాగార్జునసాగర్ డ్యాంను సందర్శించిన సీఈ