ప్రస్తుతం ఏ వస్తువు కొన్నా డిజిటల్ చెల్లింపులు తప్పని పరిస్థితిగా మారింది. డిజిటల్ చెల్లింపులను దృష్టిలో పెట్టుకుని శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన నిమ్మల రాములు అనే కల్లుగీత కార్మికుడు తన కల్లు అడ్డా వద్ద ఫోన్పే స్కానర్ను ఏర్పాటు చేసుకొని కల్లు విక్రయిస్తున్నాడు. కల్లు తాగేందుకు వచ్చేవారిలో ఎక్కువ మంది.. ఫోన్పే, గూగుల్పే ఉందా అని అడుగుతున్నారని, అవేవీ నా వద్ద లేవని చెప్పడంతో కల్లు గిరాకీ దెబ్బతింటుందని, దీంతో స్కానర్ను ఏర్పాటు చేసుకున్నానని రాములు చెప్పాడు.
– శాలిగౌరారం