రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీ పథకాలకు దాదాపు రూ.56వేల కోట్లకు పైగా నిధులు వెచించారు. మూసీ కాలువలకు ప్రాధాన్యం ఇచ్చారు. బునాదిగాని కాలువకు రూ.266 కోట్ల పాలనామోదం కూడా లభించింది. నిరుద్యోగ యువతకు యువ వికాసం పథకం వరంగా మారనుంది. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే మూసీ పునరుజ్జీవానికి రూ.17వేల కోట్లు కేటాయించడం హర్షణీయం. –కుంభం అనిల్కుమార్రెడ్డి,
ఎమ్మెల్యే, భువనగిరి
అంతా అంకెల గారడీ
బడ్జెట్ అంకెల గారిడీగా ఉంది. గత ఏడాది వ్యవసాయ రంగానికి రూ 49 వేల కోట్లు కేటా యించగా, ఈసారి రూ.24,439 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. ఇంత తక్కువ బడ్జెట్తో వ్యవసాయ రంగానికి ఏ విధంగా మేలు జరుగుతుంది. 50లక్షల కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా 25 లక్షలకు మించడం లేదు. సబ్సిడీ గ్యాస్ సగం కుటుంబాలకే అందుతుంది. రైతుభరోసా విషయంలో రైతులను మోసం చేశారు. ఆరు గ్యారంటీలు అటకెక్కాయి.
–అశోక్గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
జిల్లాకు అరకొర నిధులే..
జిల్లాకు అరకొరగా నిధులు కేటాయించారు. బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్లతో పాటు మూసీ ప్రక్షాళనకు సమగ్రమైన నిధుల కేటాయింపు లేదు. మూసీ కాలువలకు నిధులు కేటాయించడం ఊరట కలిగించింది. భువనగిరిలో డిగ్రీ, పేజీ కళాశాలలు, చౌటుప్పల్ ప్రాంతంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు ప్రస్తావనే లేదు.
–ఎండీ జహంగీర్, సీపీఎం జిల్లా కార్యదర్శి
అమోదయోగ్యమైన బడ్జెట్
అమోదయోగ్యమైన బడ్జెట్