అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.
- IIIలో
- IIలో
నారసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సంప్రదాయ పూజలు ఆగమ శాస్త్రం ప్రకారం కొనసాగాయి. వేకువజామున ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో శ్రీస్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు అభిషేకం, అర్చన చేశారు. ఇక ప్రధానాలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు, ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయద్వారబంధనం చేశారు.