రేపటి నుంచి టెన్త్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి టెన్త్‌ పరీక్షలు

Mar 20 2025 2:06 AM | Updated on Mar 20 2025 2:05 AM

కట్టుదిట్టమైన ఏర్పాట్లు

పరీక్షలు సజావుగా జరిగేలా, మాస్‌ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరిసరాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉండనుంది. సమస్యలు ఉంటే తేలియజేయడానికి, సందేహాలు నివృత్తి చేసుకోవడానికి కంట్రోల్‌ రూం నంబర్‌ 9010772080 అందుబాటులో ఉండనుంది. పరీక్షల నిర్వహణకు చీఫ్‌ సూపరింటెండెంట్లు 50, డిపార్టమెంటల్‌ ఆఫీసర్లు 50, ఇన్విజిలేటర్లు 556, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 3 టీంలను ఏర్పాట్లు చేశారు. డీఈఓ సత్యనారాయణ బుధవారం ఎంఈవోలు, సీఎస్‌, డీఓలతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించి పరీక్షల సందర్భంగా తీసుకోవాల్సి న జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు.

భువనగిరి : పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో 8,632 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరితో పాటు 188 మంది ప్రైవేట్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది.

క్యూ ఆర్‌ కోడ్‌తో బుక్‌లెట్‌

క్యూఆర్‌ కోడ్‌తో ముద్రించిన 24 పేజీలతో సన్నని లైన్లతో కూడిన బుక్‌లెట్‌ ఇవ్వనున్నారు. గతంలో వైట్‌ పేపర్లు ఇవ్వడం వల్ల సమాధానాలు రాయడంలో గందరగోళం నెలకొనేది. కొందరు క్రాస్‌గా రాసేవారు. దీంతో పాటు అదనపు పేపర్లు తీసుకున్న వారు సీరియల్‌ ప్రకారం లేకుండా దారం కట్టేవారు.దీని వల్ల పేపర్‌ మూల్యాంకనం చేసే క్రమంలో ఇబ్బందులు ఎదరై మార్కులు తక్కువగా వచ్చేవి. ఇటువంటి సమస్యలను అధిగమించేందుకు లైన్లతో కూడిన బుక్‌లెట్‌ ఇవ్వనున్నారు. అలాగే ప్రశ్న పత్రంపై క్యూ ఆర్‌కోడ్‌తో పాటు సీరియల్‌ నంబర్‌ ప్రతి పేజీపై ముద్రిస్తారు.

ఈసారి ఏడు పరీక్షలు

గతంలో పదో తరగతి విద్యార్థులకు 11పేపర్లు ఉండేవి. ఈ సంవత్సరం నుంచి ఏడు పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఫిజికల్స్‌ సైన్స్‌, బయోలజీ పేపర్లను వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలు ఒక్కో పేపర్‌ గంటన్నర వ్యవధిలో రాయాల్సి ఉంటుంది. ఒక్కోటి 40 మార్కుల చొప్పున 80 మార్కులకు పరీక్ష రాయాలి. మరో 20 మార్కులు ఇంటర్నల్‌ మార్కుల నుంచి తీసుకుంటారు.

ఫ జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాలు

ఫ హాజరుకానున్న 8,632 మంది విద్యార్థులు

ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ఫ క్యూ ఆర్‌ కోడ్‌తో ప్రశ్న పత్రాలు

గంట ముందే చేరుకోవాలి

విద్యార్థులకు నిర్దేశిత సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఐదు నిమిషాలు గ్రేస్‌ పీరియడ్‌ అవకాశం కల్పించారు. స్మార్ట్‌ వాచ్‌, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలకు కేంద్రంలోకి అనుమతి లేదు. ఒత్తిడికి లోనవకుండా విద్యార్థులకు పరీక్ష రాయలి. స్కూల్‌ యూనిఫాం ధరించి పరీక్షలకు హాజరుకావద్దు. –సత్యనారాయణ, డీఈఓ

రేపటి నుంచి టెన్త్‌ పరీక్షలు 1
1/1

రేపటి నుంచి టెన్త్‌ పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement