నారాయణపురం ఎస్సీ హాస్టల్‌లో కలెక్టర్‌ రాత్రి బస | - | Sakshi
Sakshi News home page

నారాయణపురం ఎస్సీ హాస్టల్‌లో కలెక్టర్‌ రాత్రి బస

Mar 20 2025 2:06 AM | Updated on Mar 20 2025 2:05 AM

సంస్థాన్‌ నారాయణపురం : నెలలో ఒక రోజు నిర్వహిస్తున్న హాస్టల్‌ బస కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ హనుమంతరావు బుధవారం రాత్రి సంస్థాన్‌నారాయణపురంంలోని ఎస్సీ హాస్టల్‌లో నిద్రించారు. పదో తరగతి విద్యార్థులతో పరీక్షలకు ఎలా సన్నద్ధం అవుతున్నారని ప్రశ్నించారు. ఒత్తిడి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, నిర్దేశిత సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థికి పదో తరగతి మైలు రాయి అని, ఉత్తీర్ణులైతే విజయానికి తొలి మెట్టు అవుతుందన్నారు. మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులు, గురువులకు, జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. అంతకుముందు విద్యార్థులకు వండిన భోజనాన్ని రుచి చూశారు. అదే విధంగా వంట గది, హాస్టల్‌ పరిసరాలను పరిశీలించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని వార్డెన్‌కు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ కృష్ణ, ఎంపీడీఓ ప్రమోద్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement