క్రిమిసంహారక మందు పిచికారీ చేసిన రైతుకు అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

క్రిమిసంహారక మందు పిచికారీ చేసిన రైతుకు అస్వస్థత

Mar 19 2025 1:44 AM | Updated on Mar 19 2025 1:44 AM

క్రిమిసంహారక మందు పిచికారీ చేసిన రైతుకు అస్వస్థత

క్రిమిసంహారక మందు పిచికారీ చేసిన రైతుకు అస్వస్థత

ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

నాగారం: వరి పొలానికి క్రిమిసంహారక మందు పిచికారీ చేసి అస్వస్థతకు గురై యువ రైతు మృతిచెందాడు. ఈ ఘటన నాగారం మండలం ఈటూరు గ్రామంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈటూరు గ్రామానికి చెందిన కొమ్ము మహేశ్‌(31) మూడు రోజుల క్రితం తన వరి పొలానికి దోమ కాటు మందు పిచికారీ చేశాడు. ఈ క్రమంలో మందు అతడి శరీరంపై పడడంతో అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం అతడిని సూర్యాపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సోమవారం రాత్రి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement