జాతీయ స్థాయి త్రోబాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి త్రోబాల్‌ పోటీలకు ఎంపిక

Mar 19 2025 1:44 AM | Updated on Mar 19 2025 1:44 AM

జాతీయ స్థాయి త్రోబాల్‌ పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి త్రోబాల్‌ పోటీలకు ఎంపిక

చిట్యాల: చిట్యాల పట్టణంలోని గ్రీన్‌ గ్రోవ్‌ స్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి త్రోబాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ త్రోబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి త్రోబాల్‌ పోటీల్లో పందిరి సహస్ర లక్ష్మి, మహ్మద్‌ ముబాసిర్‌ అలీ, స్టాండ్‌ బై విభాగంలో పోకల ప్రీతిజెస్సి ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 28, 29, 30వ తేదీల్లో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిలాయ్‌ జిల్లాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఎంపికై న విద్యార్థులను మంగళవారం పాఠశాల డైరెక్టర్‌ జూలకంటి వేణుగోపాల్‌రెడ్డి, ఏఓ పోలా గోవర్ధన్‌, పీఈటీ గంగాపురం రాము అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement