మోత్కూరు : మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని సుందరయ్య కాలనీకి చెందిన చింత గణేష్ కుమారుడు చింత వెంకటేష్ మూడు అంతర్జాతీయ రికార్డులు సాధించాడు. ఆదివారం హైదరాబాద్లోని హయత్నగర్లో నిర్వహించిన గాన లహరి కార్యక్రమంలో వెంకటేష్ పాల్గొని 16 గంటల పాటు నిర్విరామంగా పాటలు పాడి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, రాయల్ సక్సెస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించాడు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియన్ చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్గౌడ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ కోఆర్డినేటర్ ఎం. హారిక, రాయల్ సక్సెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ రవికుమార్, ఎస్పీ నిర్మల, త్రినాథరావు, అరుణ తదితరులు పాల్గొన్నారు.
16గంటలు పాటలు పాడి రికార్డు