కోదాడ: ఆరుపదుల వయస్సు దాటినా వారిలో ఉత్సాహం ఉరకలేస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తమలోని క్రీడానైపుణ్యాన్ని బహిర్గతం చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. రెండు రోజులుగా కోదాడలో జరుగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి పోటీల్లో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు తమలోని క్రీడా ప్రతిభను చాటుతున్నారు. కోదాడ పబ్లిక్ క్లబ్ ఆవరణలో సోమవారం రెండో రోజు పలువురు రిటైర్డ్ ఉద్యోగులు టెన్నికాయిట్, షటిల్, క్యారమ్స్, చెస్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 33 జిల్లాల నుంచి 300 మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, మంగళవారం సాయంత్రం బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతరామయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్రెడ్డి, బొల్లు రాంబాబు, రిటైర్డ్ ఉద్యోగులు అక్కిరాజు వెంకట్రావ్, గాయం పట్టాభిరెడ్డి, వేనేపల్లి శ్రీనివాసరావు, విద్యాసాగర్, భ్రమరాంబ, రఘు, ఓరుగంటి రవి, గగ్గినపల్లి సుదర్శన్రెడ్డి, బాబురావు, మేకల వెంకటేశ్వరరావు, అరుణ పాల్గొన్నారు.
కోదాడలో పోటాపోటీగా రిటైర్డ్
ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు
ఆరుపదులు దాటినా తగ్గని ఉత్సాహం
ఆరుపదులు దాటినా తగ్గని ఉత్సాహం