● ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి చదివే విద్యార్థులు అర్హులు
● ఆన్లైన్ దరఖాస్తులకు ఈ నెల 23 వరకు గడువు
మార్చి 23 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. ఏప్రిల్ 7వ తేదీన తొలి జాబితాను విడుదల చేయనున్నారు. మే 18న ఇస్రో
సూచించిన కేంద్రాల వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మే 19 నుంచి 30 వరకు 2 వారాల పాటు ఎంపికై న విద్యార్థులకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట–ఆంధ్రప్రదేశ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్–తెలంగాణ, విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్, తిరువనంతపురం–కేరళ, యుఆర్ రావు శాటిలైట్ సెంటర్, బెంగళూరు–కర్ణాటక, స్పేస్ అప్లికేషన్ సెంటర్, అహ్మదాబాద్–గుజరాత్, నార్త్–ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, షిల్లాంగ్–మేఘాలయ, ఐఐఆర్ఎస్, డెహ్రాడూన్–ఉత్తరాఖండ్లో ఎక్కడైనా ఒక చోట శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది.
ఎంపికై న విద్యార్థితో పాటు వారి తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్ ఉపాధ్యాయుడికి కూడా ప్రయాణ ఖర్చులు ఇస్రో చెల్లిస్తుంది. మే 31న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ప్రధానంగా అంతరిక్షం, సాంకేతికత, అంతరిక్ష శాస్త్రంపై అవగాహన, అంతరిక్ష అనువర్తనాలపై ప్రాథమిక జ్ఞానం అందిస్తారు. అంతరిక్ష కేంద్రాల్లో ప్రయోగశాల సందర్శన అక్కడి ప్రముఖ శాస్త్రవేత్తలతో సమావేశం, ముఖాముఖి చర్చలు, రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
ఎంపిక తేదీలు
యువ విజ్ఞాన కార్యక్రమంతో శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు అవ