అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Mar 18 2025 10:13 PM | Updated on Mar 18 2025 10:08 PM

ఆత్మకూర్‌ (ఎస్‌): మండల పరిధిలోని పాతర్లపహాడ్‌ గ్రామ ంలో సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మహి ళ మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతర్లపహాడ్‌ గ్రామానికి చెందిన గోగుల కవిత(30) సోమవారం ఉదయం ఇంట్లో అస్వస్థతకు గురై కిందపడిపోవడంతో భర్త సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ కుమార్తె మృతికి తన అల్లుడు గోగుల కమలాకర్‌, అతడి తండ్రి కారణమని మృతురాలి తండ్రి వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కమలాకర్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తన కుమార్తెను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కమలాకర్‌, అతని తల్లిదండ్రులు తన కుమార్తెను కొట్టి చంపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్‌ తెలి పారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement