నాగార్జునసాగర్: నాగార్జునసాగర్లోని విజయ విహార్ అతిథిగృహం ఆవరణలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం విజయ విహార్ ఆవరణలో వివాహం జరిగింది. ఆ సమయంలో ఏర్పడిన చెత్తను తొలగించి ఒక దగ్గర చేర్చి సోమవారం సాయంత్రం తగలబెట్టారు. అందులో నుంచి గాలికి మండే విస్తరి ఒకటి లేచి ఆవరణలోని అటవీ ప్రాంతంలో భూమిపై ఎండిపోయిన గడ్డిపై పడడంతో మంటలు అంటుకొని కాలిపోయింది. పర్యాటక సంస్థ ఉద్యోగులు అతికష్టం మీద చెట్ల కొమ్మలతో, నీటితో మంటలను ఆర్పివేశారు. లేదంటే 10ఎకరాల మేర ఉన్న అటవీ ప్రాంతంతో పాటు ట్రాన్స్ఫార్మర్, పార్కులు తగలబడేవి.