సూర్యాపేట: తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2018, 2024 సంత్సరాలకు గాను బెస్ట్ న్యూస్ పిక్చర్ అవార్డుకు ఎంపిక పోటీలు నిర్వహించగా.. సూర్యాపేట సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ అనమాల యాకయ్య 2018కి గాను బెస్ట్ న్యూస్ పిక్చర్ అవార్డుకు ఎంపికయ్యారు. సోమవారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో యాకయ్య గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా అవార్డు, నగదు పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.