భువనగిరి టౌన్ : సంక్షేమ వసగతి గృహాలు, కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని చోట్ల ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయనున్నారు. హాస్టళ్లు, కేజీబీవీల్లో నెలకొన్న సమస్యలను విద్యార్థులు, తల్లిదండ్రులు కాగితంపై రాసి ఫిర్యాదుల పెట్టెలో వేయొచ్చు. కలెక్టర్ తనిఖీలు వచ్చిన ప్పుడు, వారంలో ఒకసారి పెట్టెనుతెరిచి అందులోని ఫిర్యాదులను బయటకు తీసి పరిష్కారం చూపుతారు. పెట్టుకు సంబంధించిన తాళాలు కలెక్టర్ వద్ద ఉంటాయని సమాచారం. కాగా కలెక్టరేట్లో 80 ఫిర్యాదుల పెట్టెలు సిద్ధంగా ఉన్నాయి.