భువనగిరి : ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా సోమవారం ప్రథమ సంవత్సరం ఫిజిక్స్, ఆర్థిక శాస్త్రం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 29 కేంద్రాల్లో 6,952 మంది విద్యార్థులకు గాను 6,578 మంది హాజరయ్యారు. 374 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు.
బాల్యానికి బలం.. బాలామృతం
భువనగిరి : మండలంలోని అనంతారం, రాయగిరి పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల హాజరు రిజిస్టర్లు, బాలమృతం సరఫరాతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం బాలింతలు, గర్భిణులతో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రంలో సేవలు ఎలా అందుతున్నాయి.. సమస్యలున్నాయా, ఏమైనా మార్పులు చేయాలా.. అని అడిగారు. చిన్నారులకు బాలామృతం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, ప్రాజెక్టు సీడీపీఓలు స్వరాజ్యం, శైలజ, రమ, సూపర్వైజర్లు, అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు.
ఆలేరు : పట్టణ పరిధిలోని బహద్దూర్పేట అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీమ్ తనిఖీ చేశారు. లబ్ధిదా రుల హాజరు రికార్డులను పరిశీలించారు. పోషకాహారం పంపిణీపై చర్చించారు.
శివకేశవులకుసంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : శివకేశవులకు నిలయమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఆధ్యాత్మిక పర్వాలు కొనసాగాయి. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో కొండపైన గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో రుద్రాభిషేకం, బిల్వార్చనలు, ముఖమండపంలో స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు.రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు.
వేసవి వ్యాధులపై జాగ్రత్త
భువనగిరి : వేసవి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ నివారణ చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ మనోహర్ వైద్యారోగ్య సిబ్బందికి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశా నోడల్ పర్సన్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజారోగ్య కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. ప్రతి ఇంటిని సందర్శించి మచ్చలతో బాధపడే వారి వివరాలు సేకరించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. వడదెబ్బకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ యశోధ, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాయిశోభ, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రామకృష్ణ, వీఽణ,సుమన్ కళ్యాణ్, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు 6,578 మంది హాజరు
ఇంటర్ పరీక్షలకు 6,578 మంది హాజరు