బీబీనగర్: విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంపొందింపజేసే విధంగా జ్ఞాపక శక్తితో కూడిన విద్యను అందించాలని కలెక్టర్ హనుమంతరావు ఉపాధ్యాయులకు సూచించారు. బీబీనగర్ మండలం జమీలాపేట జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్–ఏఐ)తో కూడిన బోధన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కంప్యూటర్ ద్వారా ఆర్టిఫీషి యల్ ఇంటిలిజెన్స్ తీరును పరిశీలించారు. విద్యార్థులు గణిత శాస్త్రంలో ప్రగతిని సాధించేందుకు ఉపయోగిస్తున్న ఏఐ టెక్నాలజీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం రాయరావుపేట నుంచి నెమురగొముల వైపు ప్రవహిస్తున్న అండర్గ్రౌండ్ డ్రెయినేజీని పరిశీలించారు.ఇరు గ్రామాల మధ్య సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.
కలెక్టర్ హనుమంతరావు
‘కృత్రిమ మేధ’ తో విషయ పరిజ్ఞానం