భువనగిరి : మండలంలోని తుక్కాపురం ప్రాథమిక పాఠశాలలో ఏఐ ఆధారిత బోధన కార్యక్రమాన్ని శనివారం జిల్లా సెక్టోరియల్ అధికారి పెసరు లింగారెడ్డి ప్రారంభించారు. ఏఐ బోధనతో వెనుకబడిన విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందన్నారు. రాయడం, చదవడం సులభంగా నేర్చుకోచ్చన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ఏఐ ఆధారిత బోధన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈవిధానం చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడు రాఘవరెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపోధ్యాయుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు సదానంద, జనార్దన్, బ్రహ్మచారి, బుచ్చిరెడ్డి, లక్ష్మణ్బాబు, పద్మ, సునీత పాల్గొన్నారు.