
గ్రూప్స్లో మెరిశారు
రామన్నపేట: రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన సిలువేరు సురేష్ శుక్రవారం విడుదలైన గ్రూపు– 3 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించాడు. అదేవిధంగా ఈనెల 11న ప్రకటించిన గ్రూపు– 2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు పొందాడు. గతంలో గ్రూపు– 4 పరీక్షల్లో విజయం సాధించి ప్రస్తుతం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్– 1 సాధించడమే తన లక్ష్యమని సురేష్ పేర్కొంటున్నాడు.
గ్రూప్– 2, 3, 4 సాధించిన నారాయణపురం వాసి
చిలుకూరు: మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన బూర భిక్షం కుమారుడు సతీష్ ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 206వ ర్యాంక్ సాధించాడు. తాజాగా విడుదలైన గ్రూప్– 3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 318 ర్యాంక్ సాధించాడు. 2023లో రైల్వేలో జాబ్ వచ్చింది. ఆ ఉద్యోగానికి వెళ్లకుండా గ్రూప్స్కు సన్నద్ధమయ్యాడు. కాగా.. 2024లో గ్రూప్– 4లో ఉద్యోగం సాధించి ప్రస్తుతం సూర్యాపేట కలెక్టరేట్లో సివిల్ సప్లయ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు.
పరీక్ష రాస్తే విజయమే
మోత్కూరు: మోత్కూరుకు చెందిన గుర్రం సాయికృష్ణారెడ్డి ఇటీవల విడుదలైన గ్రూప్– 1 ఫలితాల్లో 900 మార్కులకు గాను 446 మార్కులు సాధించాడు. గ్రూపు–2 ఫలితాల్లో స్టేట్ 11వ ర్యాంకు సాధించాడు. అదేవిధంగా గ్రూపు– 3 ఫలితాల్లో స్టేట్ 29వ ర్యాంకు సాధించాడు. గ్రూపు–4 ఫలితాల్లోనూ జిల్లా మొదటి ర్యాంకు సాధించాడు. సాయికృష్ణారెడ్డి వరుస విజయాల పట్ల ఆయన తల్లిదండ్రులు మోహన్రెడ్డి, స్వరాజ్యం, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
పంచాయతీ కార్యదర్శిగా చేస్తూనే..
పెద్దఅడిశర్లపల్లి: మండలంలోని అజ్మాపురం గ్రామానికి చెందిన గడిగ బాలకృష్ణ గ్రూప్– 3 ఫలితాల్లో 285 మార్కులతో 381వ ర్యాంకు సాధించాడు. గ్రూప్– 1లో 400 మార్కులు సాధించగా, గ్రూప్– 2లో 371 మార్కులతో 442వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం చిట్యాల మండలం తాళ్లవెల్లంల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
చిల్పకుంట్ల వాసికి 91వ ర్యాంకు
నూతనకల్: గ్రూప్– 3 పరీక్ష ఫలితాల్లో నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన మందడి శ్యాంసుందర్రెడ్డి రాష్ట్ర స్థాయిలో 91వ ర్యాంకు సాధించాడు. అదేవిధంగా గ్రూప్– 2 పరీక్ష ఫలితాల్లో 400మార్కులు సాధించి రాష్ట్రస్థాయి 63వ ర్యాంకు సాధించాడు. గతంలో వీఆర్ఓ ఫరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం సూర్యాపేట సోషల్ వెల్ఫేర్లో విధులు నిర్వహిస్తున్నాడు.
రెండు పరీక్షల్లోనూ కానిస్టేబుల్ ప్రతిభ
గుర్రంపోడు: గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన మంటిపల్లి శంకర్ ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో 674 ర్యాంకు సాధించాడు. తాజాగా విడుదలైన గ్రూప్ – 3 ఫలితాల్లో 165 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం సంస్ధాన్ నారాయణపురం పోలీసు స్టేషన్లో సివిల్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు.
గ్రూప్– 3లో స్టేట్ 211వ ర్యాంక్
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): ఆత్మకూరు మండలం గట్టిగల్లు గ్రామానికి చెందిన కోన లింగయ్య– పద్మల మొదటి కుమారుడు కోన సతీష్ శుక్రవారం విడుదల చేసిన గ్రూప్ – 3 ఫలితాల్లో స్టేట్ 211 ర్యాంక్ సాధించాడు. గత ఎనిమిదేళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ గ్రూప్స్కు సన్నద్ధమయ్యాడు. గత సెప్టెంబర్లో విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో సెలక్ట్ అయ్యాడు.
గ్రూప్– 2లో 427వ ర్యాంకు, గ్రూప్– 3లో 700 ర్యాంకు
భువనగిరి: గ్రూప్– 3 ఫలితాల్లో భువనగిరి మండలం పెంచికల్పహాడ్ గ్రామానికి చెందిన అనూష రాష్ట్రస్థాయిలో 700వ ర్యాంకు సాధించింది. గ్రూప్– 2లో రాష్ట్ర స్థాయిలో 427వ ర్యాంకు సాధించగా.. జోన్లో ఉమెన్ విభాగంలో 4వ ర్యాంకు సాధించింది. గతంలో ఎకై ్సజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగానికి ఎంపిక కాగా అందులో చేరలేదు. గ్రూపు– 4లో ర్యాంకు సాధించి ప్రస్తుతం కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తోంది.

గ్రూప్స్లో మెరిశారు

గ్రూప్స్లో మెరిశారు

గ్రూప్స్లో మెరిశారు

గ్రూప్స్లో మెరిశారు

గ్రూప్స్లో మెరిశారు

గ్రూప్స్లో మెరిశారు

గ్రూప్స్లో మెరిశారు