
ప్రజల్లో చైతన్యం కలగాలి
వినియోగదారుల కమిషన్ చాలా శక్తివంతమైంది. చట్టంపై ప్రజల్లో చైతన్యం రావాలి. ఏ వస్తువైనా కొని నష్టపోతే తమను సంప్రదించవచ్చు. విమాన సేవలు, బ్యాంక్, బోర్డింగ్, కొరియర్, చిట్ ఫండ్, ఎడ్యుకేషన్ సంస్థలు, విద్యుత్ సమస్యలు, మెడికల్, ఇన్సూరెన్స్, గ్యాస్, పోస్టల్, రైల్వే, ఆర్టీసి, టెలిఫోన్, బోర్వెల్, కోల్డ్ స్టోరేజీ వీటిలో ఎలాంటి సమస్యలు కలిగినా వినియోగదారుల కమిషన్ సత్వర న్యాయం చేస్తుంది. జిల్లా వినియోగదారుల కమిషన్లో రూ.50 లక్షల వరకు ఫిర్యాదులు పరిష్కరించబడతాయి. ఆ పై రాష్ట్ర కమిషన్ను సంప్రదించాల్సి ఉంటుంది.
– మామిడి క్రిష్టోఫర్,
వినియోగదారుల కమిషన్ చైర్మన్