యాదగిరి ఆలయ మాడవీధిలో జర్మనీ టెంట్‌ | - | Sakshi
Sakshi News home page

యాదగిరి ఆలయ మాడవీధిలో జర్మనీ టెంట్‌

Mar 15 2025 1:01 AM | Updated on Mar 15 2025 1:01 AM

యాదగి

యాదగిరి ఆలయ మాడవీధిలో జర్మనీ టెంట్‌

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ఉత్తర మాడ వీధిలో జర్మనీ టెంట్‌ ఏర్పాటు చేశారు. వేసవిలో శ్రీస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు నీడ కల్పించేందుకు ఈ టెంట్‌ను బిగించారు. గతేడాది వేసవిలో సైతం ఈ టెంట్‌ను ఏర్పాటు చేసి, భక్తులకు ఎండ నుంచి ఉపశమనం కల్పించారు. ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో భక్తులు ఆలయ మాడ వీధిలో నడిచేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆలయాధికారులు జర్మనీ టెంట్‌ను ఏర్పాటు చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు

కేతేపల్లి: కేతేపల్లి మండలంలోని ఉప్పలపహాడ్‌ వద్ద 65 నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం డీసీఎంను కారు వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరుకు చెందిన వడ్లపూడి రవికిరణ్‌ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం విజయవాడ నుంచి కారులో హైదరాబాద్‌కు బయలుదేరాడు. మార్గమధ్యంలో మండలంలోని ఉప్పలపహాడ్‌ బస్‌బే సమీపంలో యూటర్స్‌ తీసుకుంటున్న డీసీఎంను కారు వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈప్రమాదంలో కారు నడుపుతున్న రవికిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి ఎస్‌ఐ శివతేజ తెలిపారు.

యాదగిరి ఆలయ మాడవీధిలో జర్మనీ టెంట్‌1
1/1

యాదగిరి ఆలయ మాడవీధిలో జర్మనీ టెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement