
నీటి ఎద్దడి రానీయొద్దు
భువనగిరిటౌన్: వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ గంగాధర్ ఆదేశించారు. బుధవారం భువనగిరిలోని జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ ప్లానింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నీరు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేలా చూడాలన్నారు. గత సంవత్సరం నీటి ఎద్దడి ఎదుర్కొన్న గ్రామాల్లో సమస్య పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో వెంటనే బోర్లకు మరమ్మతులు, ఫ్లషింగ్ చేయించాలని ఆదేశించారు. నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే స్థానికంగా నీటి సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ శోభరాణి మాట్లాడుతూ.. 2025–26కు సంబంధించి 15 వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర కమిషన్ సిఫార్సు మేరకు రూ.2,16,91,520 నిధులు కేటాయింపు చేసినట్లు చెప్పారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గంగాధర్ అన్నారు. వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన వాల్పోస్టర్ను బుధవారం జెడ్పీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా వైద్య, విద్య, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, వ్యవసాయ పశుసంవర్ధక, పబ్లిక్ వర్క్స్, పర్యావరణ, కాలుష్య నివారణ, మున్సిపల్ కమిషనర్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కూడళ్ల వద్ద, పార్కుల వంటి స్థలాల్లో చలివేంద్రాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసి తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ, వైద్యాధికారి, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ గంగాధర్