40.3 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత | - | Sakshi
Sakshi News home page

40.3 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత

Mar 13 2025 11:16 AM | Updated on Mar 13 2025 11:16 AM

40.3

40.3 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత

బొమ్మలరామారంలో ఎల్లో అలర్ట్‌ జారీ

భువనగిరిటౌన్‌: వారం రోజుల క్రితం వరకు మామూలుగానే ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు 36 నుంచి 37 డిగ్రీలున్న ఉష్ణోగ్రత 40.3 డిగ్రీలకు చేరడంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బొమ్మలారామారం మండలంలో బుధవారం 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. కాగా.. రాజాపేటలో 39.1, నారాయణపురంలో 38.7, ఆలేరులో 38.5, అడ్డగూడూరులో 38.4, గుండాలలో 38.3, చౌటుప్పల్‌లో 38.2, బీబీనగర్‌లో 38.1, మోత్కూర్‌లో 38, తుర్కపల్లిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మెనూ ప్రకారం

ఆహారం అందించాలి

భువనగిరి: మెనూ ప్రకారం ఆహారం అందించడంతో పాటు నాణ్యత ప్రమాణాలను పాటించాలని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం వద్ద ఎస్టీ బాలికల కళాశాల హాస్టల్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏకాగ్రతతో చదువుకుని ఉన్నత విలువలతో తమ లక్ష్యాలను సాధించాలన్నారు. పుస్తకాలను చదివే అలవాటును పెంచుకోవాలన్నారు. హాస్ట ళ్లలో మెనూ పాటించకపోతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు వంట గదిని పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందజేశారు. ఇంగ్లిష్‌ టు తెలుగు డిక్షనరీలను పంపిణీ చేశారు.

రైతులకు అవగాహన

సదస్సులు నిర్వహించాలి

భువనగిరిటౌన్‌: బ్యాంకు, వ్యవసాయ శాఖ సమన్వయంతో రైతులకు రుణ మార్పు, తక్కువ వడ్డీ సదుపాయంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి మాధవిలత అన్నారు. బుధవారం లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, వివిధ బ్యాంకుల మేనేజర్లు, వ్యవసాయ అధికారి గోపాల్‌తో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి, రామన్నపేట, రాజాపేటలోని రైతువేదికల్లో వ్యవసాయ న్యాయ సేవా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. న్యాయ సహాయం, సలహాలు న్యాయ సేవా సంస్థల ద్వారా అందించటం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ శివరామకృష్ణ ఉన్నారు.

టెండర్‌ డబ్బులు

చెల్లించిన వారికే ధాన్యం

గూగుల్‌ మీట్‌లో మిల్లర్లతో

అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి

సాక్షి,యాదాద్రి: 2022– 23 సంవత్సరానికి టెండర్‌ ధాన్యం డబ్బులు పూర్తిగా చెల్లించిన మిల్లర్లకే యాసంగి ధాన్యం కేటాయింపులు ఉంటాయని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి సూచించారు. బుధవారం జిల్లాలోని రైస్‌ మిల్లర్లు, అధికారులతో గూగుల్‌ మీట్‌ ద్వారా మాట్లాడారు. 10 మంది మిల్లర్లు ఇంకా టెండర్‌ ధాన్యం డబ్బులు చెల్లించలేదన్నారు. కొన్ని మిల్లుల్లో 2024–25 వానాకాలం ధాన్యం నిల్వ లు లేవని సమాచారం ఉందని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎంఆర్‌ డెలివరీ వేగవంతం చేయడానికి ప్రతి ఒక్క మిల్లర్‌ కమిషనర్‌ ఆదేశాలను పాటించాలన్నారు. బియ్యం సరఫరా పూర్తి చేయని మిల్ల ర్లకు ధాన్యం కేటాయింపులు చేయబోమని తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని లక్ష్మీనర్సింహ అగ్రో ఇండస్ట్రీస్‌ ముక్తాపూర్‌, ఎల్‌ఎన్‌ ఆగ్రోస్‌ గుండాల మిల్లుల యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. ఇప్పటినుంచి జిల్లా లో ఎనిమిది తనిఖీ బృందాలు ఏర్పాటుచేసి ఒక్కో కమిటీ 6 మిల్లులను చెక్‌ చేసి నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలన్నారు. సమావేశంలో జిల్లా రైస్‌ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు.

40.3 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత
1
1/1

40.3 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement