ప్రభుత్వం కరుణించేనా! | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం కరుణించేనా!

Mar 13 2025 11:16 AM | Updated on Mar 13 2025 11:16 AM

ప్రభు

ప్రభుత్వం కరుణించేనా!

సాక్షి, యాదాద్రి: ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు లేక పలు పెండింగ్‌ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు, ఎంఎంటీఎస్‌, గౌరెల్లి– కొత్తగూడెం జాతీయ రహదారి, మూసీ కాలువల ఆధునీకరణ, బస్వాపురం రిజర్వాయర్‌ బాఽధితులకు నష్ట పరిహారం, గంధమల్ల రిజర్వాయర్‌, రోడ్లు, ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు, టూరిజం సర్క్యూట్‌కు నిధులు లేక నిలిచిపోయాయి. ఈనెల 19న చేపట్టే వార్షిక బడ్జెట్‌ సమావేశాల్లోనైనా ఈసారి నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

మూసీకాలువల ఆధునీకరణకు

విడుదల కాని నిధులు

సాగు నీటి అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం మూసీ కాలువల ఆధునీకరణకు నిధులు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్‌, నల్లగొండ నియోజకవర్గాల రైతులకు అదనపు సాగు నీరందించేందుకు కాలువలను మంజూరు చేశారు. ప్రధానంగా బునాదిగాని, పిల్లాయపల్లి, ధర్మారెడ్డి కాలువలను ఆధునీకరించడానికి గత సంవత్సరం ప్రభుత్వం జీవో జారీ చేసింది. పిల్లాయిపల్లి కాలువకు రూ.86.22 కోట్లు,ధర్మారెడ్డికాలువకు రూ.123.98 కోట్లు, బునాదిగాని కాలువకు రూ.266కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా ఆమోదం తెలిపింది. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.

ముంపు బాఽధితులకు అందని నష్ట పరిహారం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బస్వాపూర్‌ రిజర్వాయర్‌ భూ నిర్వాసితులకు పరిహారం రాలేదు. బీఎన్‌ తిమ్మాపూర్‌ నిర్వాసితులకు రూ.109 కోట్లు పరిహారం ఇవ్వాలి. డిసెంబర్‌లో ముంపు నిర్వాసితులకు రూ.50 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. అయితే పూర్తి స్థాయిలో పరిహారం రాకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ముందుగా తక్కువ పరిహారం లభించే వారికి ఇవ్వాలని నిర్ణయం కూడా చేశారు. ఈలోపు కాలయాపన కావడంతో రూ.50 కోట్లను ఇతర ప నులకు మళ్లించారు. పరిహారం కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు భూసేకరణ కు మరో రూ.200 కోట్లు అవసరం ఉన్నాయి. పరి హారం చెల్లిస్తే తప్ప రిజర్వాయర్‌లో నీటిని నిల్వచేసే పరిస్థితి లేదు.

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు జిల్లాకు మంజూరు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 55 నియోజకవర్గాలకు సూళ్లను మంజూరు చేసిన ప్రభుత్వం భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు ఒక్కటి కూడా కేటాయించలేదు.

రోడ్లకు నిధుల మంజూరు ఏదీ?

జిల్లాలోని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల్లో రోడ్లు మంజూరు చేశారు. పలు రోడ్లకు శిలాఫలకాలను కూడా వేశారు. అయితే నిధుల లేమితో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. ఆలేరు– కొలనుపాక రోడ్డుపై బ్రిడ్జిలు, మూసీ కాలువలపై బ్రిడ్జిలు, రాయిగిరి– మోత్కూరు రోడ్డు, చిట్యాల – భువనగిరి రోడ్డు వెడల్పు పనులు ఇలా జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల విలువ చేసే రోడ్ల పనులు నిధులు లేక నిలిచిపోయాయి.

గంధమల్లకు నిధులు వచ్చేనా

గంధమల్ల రిజర్వాయర్‌కు ఇటీవల జరిగిన కేబినెట్‌లో ఆమోదం లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఈ రిజర్వాయర్‌కు నిధుల కొరత ఉంది. సామర్థ్యం తగ్గించి నిర్మించడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే నిధులు కేటాయిస్తే తప్ప పనులు ప్రారంభం కావు.

టూరిజం సర్క్యూట్‌కు నిధులు అవసరం

భువనగిరి, కొలనుపాక, యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి, రాయిగిరి ఇలా పలు చోట్ల టూరిజం అభివృద్ధికి నిధుల అవసరం ఉంది. ప్రపంచ టూరిజం గ్రామంగా పోచంపల్లిని మూడేళ్ల క్రితం గుర్తించారు. కానీ నిధులు కేటాయించక ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు.

ఫ నిధుల లేమితో

ముందుకు సాగని పెండింగ్‌ ప్రాజెక్టులు

ఫ పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగాని

కాల్వలకు విడుదల కాని నిధులు

ఫ బస్వాపూర్‌ రిజర్వాయర్‌

భూ నిర్వాసితులకు అందని పరిహారం

ఫ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లోనైనా నిధులు

కేటాయించాలని జిల్లా ప్రజల వేడుకోలు

ప్రధాన సమస్యలపై ప్రస్తావిస్తా

నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. గంధమల్ల, రోడ్లు, అభివృద్ధి పనుల కోసం నిధులు కావాలని సీఎంను కలిసి ఇప్పటికే విజ్ఞప్తి చేశా. బడ్జెట్‌లో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

– బీర్ల ఐలయ్య, ప్రభుత్వ విప్‌,

నిధులు మంజూరు చేయాలని కోరుతా

భువనగిరి నియోజకవర్గంలో సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు కావాల్సి ఉంది. మూసీ కాలువల ఆధునీకరణ, బస్వాపూర్‌ రిజర్వాయర్‌కు నిధులు కావాలి. యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మంజూరు చేయాలి. అదేవిధంగా టూరిజం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతాను.

– అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే , భువనగిరి

భూసేకరణకు నిధుల కొరత

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్‌ రింగ్‌రోడ్డు, ఎంఎంటీఎస్‌, గౌరెల్లి– కొత్తగూడెం జాతీయ రహదారి 330ఏ ల భూ సేకరణ నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ పూర్తి చేస్తే కేంద్రం పనులను చేపడుతుంది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భూసేకరణచేయాలని రాష్ట్రాన్నికోరారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం భూ సేకరణ కు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే ఈ ప్రాజెక్టులు ముందుకు కదిలే అవకాశం ఉంది.

ప్రభుత్వం కరుణించేనా!1
1/4

ప్రభుత్వం కరుణించేనా!

ప్రభుత్వం కరుణించేనా!2
2/4

ప్రభుత్వం కరుణించేనా!

ప్రభుత్వం కరుణించేనా!3
3/4

ప్రభుత్వం కరుణించేనా!

ప్రభుత్వం కరుణించేనా!4
4/4

ప్రభుత్వం కరుణించేనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement