ప్రభుత్వ పాఠశాలలకు ‘పీఎం శ్రీ’ వరం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలకు ‘పీఎం శ్రీ’ వరం

Mar 13 2025 11:16 AM | Updated on Mar 13 2025 11:16 AM

ప్రభు

ప్రభుత్వ పాఠశాలలకు ‘పీఎం శ్రీ’ వరం

ఒక్కో పాఠశాలకు మంజూరయ్యే నిధులు ఇలా..

250 మంది విద్యార్థుల లోపు రూ.75వేలు

250 మంది విద్యార్థులకు పైన రూ.1లక్ష

సీసీ కెమెరాలకు రూ.50వేలు

వార్షిక వేడుకలకు రూ.50వేలు

కరాటే శిక్షణకు రూ.30వేలు

ఎక్స్‌ప్లోరల్‌ విజిట్‌ ఒక్కో విద్యార్థికి రూ.500

క్షేత్రస్థాయి అధ్యయనం ఒక్కొక్కరికి రూ.500

హరిత కార్యక్రమాలకు. రూ 500

దినపత్రికలకు రూ.12వేలు

సమీప పాఠశాలల అధ్యయనం రూ.20వేలు

బాలికల చైతన్యానికి రూ.5వేలు

సైన్స్‌ సర్కిల్‌ ఏర్పాటుకు రూ.15వేలు

మ్యాథ్స్‌ సర్కిల్స్‌ ఏర్పాటుకు రూ.15వేలు

రామన్నపేట : విద్యారంగంలో మార్పులు తీసుకురావడం, మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా) పథకంతో అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య, అభ్యసన అనుభవాలను అందిస్తున్నారు. విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించేందుకు విజ్ఞానయాత్రలకు తీసుకెళ్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్నాయి. కాగా.. పీఎం శ్రీ పథకాన్ని కేంద్రం గతేడాది ప్రారంభించింది.

మొదటి దశలో ఎంపికై న స్కూళ్లు ఇవీ..

తొలి విడతలో జిల్లానుంచి 17 పాఠశాలలకు చోటు దక్కింది. ఇందులో ఆలేరు, కొలనుపాక, ఆత్మకూరు(ఎం), బస్వాపూర్‌, బీబీనగర్‌, చీకటిమామిడి, దండుమల్కాపురం, జూలూరు, రాజాపేట, వెల్లంకి, యాదగిరిగుట్ట (బాలికల) జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, గుండాల, ఎం.తుర్కపల్లి, సంస్థాన్‌నారాయణపురం, భూదాన్‌పోచంపల్లి మోడల్‌స్కూ ళ్లు, భువనగిరి బాలుర సాంఘిక సంక్షేమ గురుకులం, చౌటుప్పల బాలికల గురుకుల పాఠశాల ఉన్నాయి.

రెండవ విడతలో..

రెండో విడతలో 8 పాఠశాలలు ఎంపికయ్యాయి. వాటిలో కోటమర్తి ఎంపీపీఎస్‌, ఆలేరులోని బాలికల గురుకులం, భువనగిరిలోని గంజ్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మోటకొండూరు మండలం చాడ ఎంపీపీఎస్‌, మోత్కూరు మండలం పాలడుగు ఎంపీయూపీఎస్‌, వలిగొండ మండలం ఎం.తుర్కపల్లి ఎంపీయూపీఎస్‌, మల్లాపూర్‌ ఎంపీపీఎస్‌, పోచంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.

నిధులను వీటికి ఖర్చు చేస్తారు

పథకానికి ఎంపికై న పాఠశాలలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 60:40 శాతం నిష్పత్తిలో నిధులు మంజూరు చేస్తాయి. ఈ నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రయోగశాలలు, ల్యాబ్‌లలో పరికరాలను సమకూర్చడం, విద్యార్థుల ఫీల్డ్‌ ట్రిప్స్‌, ఎక్స్‌ప్లోరర్‌ విజిట్‌కు తీసుకు వెళ్లడం, వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన వారితో తరగతులను నిర్వహణ, బాలికల ఆత్మరక్షణకు శిక్షణ ఇప్పించడం, బాలికల సాధికారిత క్లబ్‌ల ఏర్పాటు చేస్తారు. ఎంపికై న పాఠశాలకు ఐదేళ్ల కాలానికి విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.2కోట్ల వరకు ప్రభుత్వాలు ఖర్చు చేస్తాయి. ఇప్పటి వరకు ఎంపికై న పాఠశాలల ఖాతాల్లో రూ.2.50 కోట్లు జమ అయ్యాయి.

ఫ అత్యున్నత ప్రమాణాలతో బోధన

ఫ విజ్ఞానం పెంపొందించేందుకు ఫీల్డ్‌ విజిట్‌

ఫ రెండు విడతల్లో 25 పాఠశాలల ఎంపిక

ఫ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిధులు విడుదల

ఎక్స్‌ప్లోరర్‌, ఫీల్డ్‌ విజిట్‌లతో ఎంతో మేలు కలుగుతుంది

ఎక్స్‌ప్లోరర్‌ విజిట్‌లో భాగంగా రామప్ప దేవాలయం, కాకతీయుల కళాతోరణం, లక్నవరం, పాకాల చెరువులను సందర్శించాం. భువనగిరి సమీపంలోని వ్యవసాయక్షేత్రానికికు వెళ్లి పంటల సాగుపై అధ్యయనం చేశాం. తరగతి గదుల్లో బోధనకు, క్షేత్ర పర్యనలు తోడవడం వల్ల వివిధ అంశాలపై అవగాహన పెరిగింది. ఫీల్డ్‌ విజట్‌లతో ఎంతో మేలు జరుగుతుంది.

– విద్య, పదవ తరగతి విద్యార్థి

పాఠశాలల బలోపేతానికి దోహదం

ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా పథకం గ్రామీణ ప్రాంత పాఠశాలల బలోపేతానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి దోహదపడుతుంది. ఎక్స్‌ప్లోరర్‌, ఫీల్డ్‌ విజిట్‌ల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన పీఎం శ్రీ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా చూస్తున్నాం.

– సురేందర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, వెల్లంకి

ప్రభుత్వ పాఠశాలలకు ‘పీఎం శ్రీ’ వరం 1
1/4

ప్రభుత్వ పాఠశాలలకు ‘పీఎం శ్రీ’ వరం

ప్రభుత్వ పాఠశాలలకు ‘పీఎం శ్రీ’ వరం 2
2/4

ప్రభుత్వ పాఠశాలలకు ‘పీఎం శ్రీ’ వరం

ప్రభుత్వ పాఠశాలలకు ‘పీఎం శ్రీ’ వరం 3
3/4

ప్రభుత్వ పాఠశాలలకు ‘పీఎం శ్రీ’ వరం

ప్రభుత్వ పాఠశాలలకు ‘పీఎం శ్రీ’ వరం 4
4/4

ప్రభుత్వ పాఠశాలలకు ‘పీఎం శ్రీ’ వరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement