
బుద్ధవనం నిర్మాణం అద్భుతం
నాగార్జునసాగర్: బుద్ధవనం నిర్మాణం అద్భుతంగా ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని బుధవారం ఆయన కమిన్ సభ్యులతో కలిసి సందర్శించారు. లాంచీలో ప్రయాణించారు. బుద్ధవనంలో బుద్ధుని పాదుకల వద్ద పుష్పాంజలి ఘటించారు. సాగర్ డ్యాం, జలవిద్యుదుత్పాదన కేంద్రం, బుద్ధచరిత వనం, జాతక వనం, స్థూప వనం, మహాస్థూపం, స్థూపం అంతర్భాగంలో గల అష్టబుద్ధులను సందర్శించారు. బుద్ధవనాన్ని ప్రతిఒక్కరు సందర్శించాలని అన్నారు. వీరికి పర్యాటక శాఖ గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషానలు వివరించారు. ఆయన వెంట కమిషన్ సభ్యులు కుసురం నీలాదేవి, రాంబాబునాయక్, లక్ష్మీనారాయణ, శంకర్, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, నల్లగొండ జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ పీడీ కోటేశ్వర్రావు, స్థానిక ఎస్ఐ సంపత్గౌడ్, ఆర్ఐ దండ శ్రీనివాస్రెడ్డి, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
బక్కి వెంకటయ్య